Election Commission: ఎన్నికల వేళ ఈసీ సంచలన నిర్ణయం.. ఇకపై వారికి కూడా..
ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటు వేసే వృద్ధులు, వికలాంగులు, పేషెంట్లకు సహాయకులుగా వచ్చే వారికి కూడా ఇంక్ వేయాలని నిర్ణయించింది ఈసీ. ఈ సహాయకులకు కుడి చేతి చూపుడు వేలికి ఇంక్ వేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Telangana Elections: తెలంగాణలో కీలక నేతల ఆస్తులు.. వారిపై ఉన్న కేసులు ఇవే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రధాన పార్టీలకు చెందిన నేతలు తమ తమ నియోజకవర్గాల్లో నామినేషన్స్ దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్య నేతలు చాలా మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఆ నామినేషన్ అఫిడవిట్ లో ఆస్తులు, అప్పులు, కేసలు వివరాలను పేర్కొన్నారు.
తెలంగాణలో 80 శాతం కాంట్రాక్టులు మెఘాకే.. వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు..
కాళేశ్వరం ప్రాజెక్టుపై సంచలన ఆరోపణలు చేశారు వైఎస్ షర్మిల. 'నేను తినను.. ఇంకొకరిని తిననివ్వను అన్న మోదీకి ఇప్పుడు ఏమైంది. కేసీఆర్ మొత్తం తింటూనే ఉన్నారు.. మోదీ చూస్తేనే ఉన్నారు.. మరి ఏం చేస్తున్నారు మీరు' అంటూ ప్రదాని మోదీని ప్రశ్నించారు షర్మిల.
Ponguleti: నమ్ముకున్న వారందరికీ న్యాయం చేస్తా.. కాంగ్రెస్ ను గెలిపిస్తా: పొంగులేటి సంచలన ఇంటర్వ్యూ
ఎన్నికల తర్వాత తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రానుందని కాంగ్రెస్ కీలక నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. టికెట్లు దక్కని. అవకాశం రాని నేతలకు అందరికీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీవీకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
Telangana: ప్రజలు సంతలో గొర్రెలు కాదు.. కేసీఆర్పై సంచలన కామెంట్స్ చేసిన పొంగులేటి..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై సంచలన కామెంట్స్ చేశారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పాలేరులో తనను ఓడించేందుకు కందాల ఉపేందర్ రెడ్డికి రూ. 100 కోట్లు పంపించారని ఆరోపించారు. ఎవరిని నమ్మాలో ప్రజలకు తెలుసునని అన్నారు.
Kodangal Elections: కొడంగల్లో రేవంత్ వర్సెస్ పట్నం నరేందర్ రెడ్డి.. ఎవరి బలం ఏంటో తెలుసా?
కొడంగల్లో రేవంత్ వర్సెస్ నరేందర్ రెడ్డి టఫ్ ఫైట్ ఉండనుంది. గత ఎన్నికల్లో నరేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయిన రేవంత్.. ఈసారి తన సొంత నియోజకవర్గంలో ఎలాగైనా గెలిచి నిలవాలని ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన వీరిద్దరి బలాబలాలు తెలుసుకోండి.
KA Paul: నామినేషన్స్ గడువు పెంచండి.. ఈసిని డిమాండ్ చేసిన కేఏ పాల్
తెలంగాణలో నామినేషన్ల గడువును పెంచాలని ఎన్నికల సంఘాన్ని కోరారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పెంచాలన్నారు. ఇదే సమయంలో తమ పార్టీ అభ్యర్థుల రెండవ జాబితాను విడుదల చేశారు కేఏ పాల్. ఈ లిస్ట్ లో ఏడుగురు సభ్యులు ఉన్నారు.
Telangana Congress: దగ్గరకు తీసుకోని బీఆర్ఎస్.. కాదన్న కాంగ్రెస్.. జలగం దారెటు?
ఖమ్మం బీఆర్ఎస్ నేత జలగం వెంకట్రావ్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో.. కాంగ్రెస్లో చేరి పోటీ చేసేందుకు సిద్ధమవగా.. అక్కడా నిరాశే ఎదురైంది. తాను పోటీ చేయాలని భావించిన కొత్తగూడెం సీటును పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించింది కాంగ్రెస్.