రైతు భరోసా వారికే.. || CM Revanth Shocking decision On Rythu Barosa ||Telangana || RTV
TG: బీజేపీలో ప్రధాని అభ్యర్థి మోడీ.. మరి కాంగ్రెస్లో ప్రధాని అభ్యర్థి ఎవరు? అని ప్రశ్నించారు తమిళిసై. రాహుల్ రిజర్వేషన్ల మీద అసత్యపు ప్రచారం చేసి కులమతాలను రెచ్చగొట్టి లబ్ది పొందాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో బీజేపీకి మెజారిటీ స్థానాలు వస్తాయన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.155 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రూ.61.11 కోట్ల నగదు, రూ.19.16 కోట్ల నగలు, రూ. 28.92 కోట్ల మద్యం, రూ.23.87 కోట్ల డ్రగ్స్, రూ.22.77 కోట్ల విలువైన వస్తువులు సీజ్ చేశామన్నారు.
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం మన్సాన్పల్లి శివారులో పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. 20 మందికి గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జోగిపేట ప్రభుత్వాస్పత్రికి క్షతగాత్రుల తరలించారు.
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ప్రజాశాంతి పార్టీలో చేరిన మాజీ మంత్రి బాబూమోహన్ కు కీలక పదవీ ఇచ్చారు. ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా బాబూమోహన్ ను నియమించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి రావు కలిసి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు విచారణలో పోలీస్ అధికారులు గుర్తించారు.