ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత.. ప్రభుత్వ కీలక నిర్ణయం
తెలంగాణలో తొలి కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకాలంలో ఉద్యమకారులపై నమోదైన కేసులన్నిటినీ ఎత్తివేయాలని పోలీసు శాఖకు ఆదేశాలు జారీచేసింది.
తెలంగాణలో తొలి కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకాలంలో ఉద్యమకారులపై నమోదైన కేసులన్నిటినీ ఎత్తివేయాలని పోలీసు శాఖకు ఆదేశాలు జారీచేసింది.
తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ కీలక పాత్ర పోషించనున్నారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఆయన్ను నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాగే, టీఎస్పీఎస్సీ చైర్మన్గానూ నియమించే అవకాశం కనిపిస్తోంది.
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కాంగ్రెస్ ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన ఫ్రీ బస్సు ప్రయాణం పథకం డిసెంబర్ 9వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. మహిళలు తమ ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుందని అధికారులు తెలిపారు.
కాంగ్రెస్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. 11 మంది మంత్రులతో మంత్రివర్గం ఏర్పాటైంది. కేబినెట్లో ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీ, బీసీలు ఇద్దరు, ఓసీలు ఆరుగురు ఉన్నారు.
తెలంగాణ నూతన ప్రభుత్వం గురువారం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటు.. 11 మంది మంత్రులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ 11 మంది మంత్రులకు సంబంధించిన వివరాలు గవర్నర్ కార్యాలయానికి పంపించారు కాంగ్రెస్ నేతలు.
తెలంగాణ నూతన ప్రభుత్వం జర్నలిస్టుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. జర్నలిస్టులను నూతన సచివాలయంలోకి అనుమతించింది. ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి.
ఎన్నికల ముంగిట తెలంగాణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో నలుగురు కలెక్టర్లు, 13 మంది ఎస్పీలు, సీపీలను బదిలీ చేసింది ఎన్నికల కమిషన్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక బదిలీ అయిన పోలీసు అధికారుల్లో తొమ్మిది మంది నాన్ క్యాడర్ అధికారులు ఉన్నారు.
దసరా సెలవుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఈ నెల 24న దసరా సెలవు ఉంటుందని మొదట ప్రకటించగా.. తాజాగా ఆ తేదీని ఈ నెల 23కు మార్చింది ప్రభుత్వం. దీంతో పాటు ఈ నెల 24న కూడా సెలవు ఉంటుందని స్పష్టం చేసింది.
తెలంగాణలో మరో 3 కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో వనపర్తి జిల్లాలో ఏదుల, నిర్మల్ జిల్లాలో మాలెగావ్, బెల్తారోడా నూతన మండలాలుగా ఏర్పాటు కానున్నాయి.