ఆయనది ఓ దిక్కుమాలిన విజన్: పేర్ని!
టీడీపీ అధినేత చంద్రబాబు మీద వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శలు గుప్పించారు. గతంలో విజన్ 2020 అన్న వాడు ఇప్పుడు విజన్ 2047 అంటున్నారని మండిపడ్డారు.
టీడీపీ అధినేత చంద్రబాబు మీద వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శలు గుప్పించారు. గతంలో విజన్ 2020 అన్న వాడు ఇప్పుడు విజన్ 2047 అంటున్నారని మండిపడ్డారు.
తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ పట్నంలో నిర్వహించిన సభలో విజన్ డాక్యుమెంట్ 2047 ని ఆవిష్కరించారు. ఈ డాక్యుమెంట్ ను ఇండియా ఇండియన్స్ తెలుగూస్ పేరుతో రూపొందించారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ల పై మరోసారి నిప్పులు చెరిగారు ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డి. ప్రజలకు ఏం చేశామో చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. ఏమీ చేయలేకపోయామని తనను తాను తిట్టుకోవాల్సిన చంద్రబాబు
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని ఆగం చేయాలని చూస్తున్నారని ప్రభుత్వ ప్రధాన సలహాదారుల సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో బాబు ఓ పక్క, దత్తపుత్రుడు, మరోపక్క, తన సుపుత్రుడు ఇంకోపక్క తిరుగుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు మంచి చేయని చంద్రబాబు.. మంచి చేస్తున్న జగన్ను ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించారు.
జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ గుంటూరు, విజయవాడ నగరాలు సర్వనాశనం అయ్యాయి. ఇప్పుడు ఆ పెద్ద మనిషి విశాఖ పట్నంలో అడుగుపెడతాను అంటున్నాడు..ఆయన విశాఖకు గానీ వస్తే విశాఖ మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జి బుద్దా వెంకన్న అన్నారు.
ఏపీ రాజకీయాల్లో వేడివేడిగా ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది గన్నవరం నియోజకవర్గమే. ఇక నుంచి గన్నవరం నియోజకవర్గంలోనే కొనసాగుతాను అంటున్నారు వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కలిసి రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కల్గించాలని చూస్తున్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరొపించారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో తిరుగుతున్న నేతలు ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు అధికారం రాదేమో అనే భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.
గన్నవరంలో వైసీపీకి షాక్ తగిలేలా కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న యార్లగడ్డ వెంకట్రావు.. టీడీపీలో జంప్ అయ్యేందుకు రెడీ ఐనట్టు తెలుస్తోంది. ఈ నెల 19న టీడీపీ యువ నేత నారా లోకేశ్ పాదయాత్ర ఎన్టీఆర్ జిల్లాలోకి ఎంట్రీ ఇవ్వనుండడంతో ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీలోకి యార్లగడ్డ వెళ్లనున్నారన్న ప్రచారం జరుగుతోంది. వల్లభనేని వంశీకే వైసీపీ నుంచి గన్నవరం టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండడంతోనే యార్లగడ్డ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు.
కొద్ది రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లా అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరులో పర్యటించే క్రమంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు కూడా అంగళ్లులో తన పై జరిగింది హత్యాయత్నమేనని ఆరోపించారు. దీని గురించి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు.