రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లింది.. ప్రధానికి ఫిర్యాదు చేస్తాం
శుక్రవారం పుంగనూరులో జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై స్పందించిన టీడీపీ ఎంపీ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయన్నారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా పని చేస్తున్నారని విమర్శించారు. మాజీ సీఎంకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు.