Sharmila: అన్న వర్సెస్ చెల్లి.. కడప ఎంపీ బరిలో వైఎస్ షర్మిల..!
కడప ఎంపీ బరిలో వైఎస్ షర్మిల ఉండనున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం ఆదేశాలతో పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 25న ఏపీ కాంగ్రెస్ మొదటి లిస్ట్ రానుంది.
కడప ఎంపీ బరిలో వైఎస్ షర్మిల ఉండనున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం ఆదేశాలతో పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 25న ఏపీ కాంగ్రెస్ మొదటి లిస్ట్ రానుంది.
తిరుపతి వేదికగా ఏపీకి ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ ప్రకటిస్తామన్నారు APCC ఛీఫ్ వైఎస్ షర్మిల. పోలవరం, రాజధాని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేత లాంటి నిర్ణయాలు అమలు కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని షర్మిల వెల్లడించారు.
వైసీపీ సర్కార్ పై APCC చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అన్నింటిలో నీచ రాజకీయాలు చేస్తున్న వైసీపీ.. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అంటూ క్రీడలపై కూడా దౌర్భాగ్య రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆటగాళ్ల భవితను, ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అరెస్ట్ అయ్యారు. మెగా డీఎస్సీ ప్రకటించాలని ఆందోళన చేపట్టిన ఆమెను ఉండవల్లిలో పోలీసులు బలవంతంగా ఈడ్చుకుంటూ లాక్కొని వెళ్లారు. దీంతో ఉండవల్లిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
విజయవాడలో ఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మెగా డీఎస్సీనీ దగా డీఎస్సీ చేశారని ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను సైతం అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది.
చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రావాలని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్. ఆయన సీఎం అయ్యేందుకు ఇది చివరి అవకాశమని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అన్నారు. అలాగే ఏపీ రాజధానిగా తిరుపతి ఉండాలని డిమాండ్ చేశారు.
వైసీపీ ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శలు గుప్పించారు. మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా? అంటూ ఫైర్ అయ్యారు. రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ చేశారే తప్ప.. అభివృద్ధి చూపలేదని మండిపడ్డారు.
గుంటూరు జిల్లా కొలకలూరులో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కొనుగోలు పెద్ద మాఫియా అని ఆరోపించారు.
సీఎం జగన్పై నిప్పులు చెరిగారు మాజీ ఎంపీ హర్ష కుమార్. సీఎం జగన్ దళిత ద్రోహి అంటూ వ్యాఖ్యలు చేశారు. దళిత జాతి సీఎం జగన్ను 420 గా భావిస్తుందని పేర్కొన్నారు. వైసిపి నుంచి దళితులను దూరం చేసే భాధ్యత తాను తీసుకుంటానని అన్నారు.