మహాకుంభమేళాకు ముస్లిం వ్యక్తి... రుద్రాక్ష ధరించి త్రివేణి సంగమంలో స్నానం
ముస్లిం మతానికి చెందిన షేక్ రఫీక్ ఒడిశా నుంచి మహా కుంభమేళాకు వచ్చి రుద్రాక్షమాల ధరించి త్రివేణి సంగమంలో స్నానం ఆచరించాడు. రఫీక్ ఓ టీ స్టాల్ నడిపిస్తున్నాడు. అక్కడికి వచ్చిన వాళ్లంతా మహాకుంభమేళా గురించి గొప్పగా మాట్లాడుకుంటుంటే విని ఇక్కడికి చేరుకున్నాడు.