DC vs LSG | విశాఖ స్టేడియంకు భారీగా చేరుకున్న క్రికెట్ ఫ్యాన్స్ | IPL 2025 At Visakhapatnam | RTV
హైదరాబాద్లో ఘోరం జరిగింది. పోచారం ఇన్ఫోసిస్ దగ్గర నాలుగేళ్ల చిన్నారిని బీరు సీసాతో కొట్టి చంపాడు ఓ సైకో. గాంధీ ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ రియా కుమారి చనిపోయింది. నిందితుడు వెస్ట్బెంగాల్కు చెందిన హేమ్బ్రోమ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. టెన్త్, ఐటీఐ, డిప్లొమా అర్హతతో 9970 అసిస్టెంట్ లోకోపైలెట్ ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ https://indianrailways.gov.in/.
భోజన ప్రియులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడ నగరంలో ఇకపై అర్ధరాత్రి 12గంటల వరకూ రెస్టారెంట్లు, హోటళ్లు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చింది. ఆదివారం రాత్రి నుంచే ఇది అమల్లోకి వచ్చినట్లు పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు తెలిపారు.
మహారాష్ట్రలో ఫోన్లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ బస్సు నడిపిన ఆర్టీసీ డ్రైవర్పై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. అతడిని విధుల నుంచి తొలగించడంతోపాటు రూ.5వేల జరిమానా విధించారు. ముంబై- పుణె మార్గంలో వెళ్తున్న ‘ఈ-శివనేరీ’ బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది.
రైతులకు 'సంయుక్త కిసాన్ మోర్చా' మరో కీలక పిలుపునిచ్చింది. పంజాబ్ పోలీసుల చర్యకు వ్యతిరేకంగా మార్చి 28న దేశవ్యాప్తంగా రైతులంతా ఆయా జిల్లాల్లో నిరసన చేపట్టాలని కోరింది. కనీస మద్దతు ధర, రుణమాఫీ, వ్యవసాయ వ్యతిరేక చట్టాలపై ఆందోళనకు దిగాలని సూచించింది.
మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2025 ఆరంభంకానుంది. మార్చి 22న ఈడెన్గార్డెన్స్లో KKR Vs RCB మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. రానున్న రెండు రోజుల్లో పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మ్యాచ్ రద్దు అయ్యే ఛాన్స్ ఉంది.
నిరుద్యోగులకు తెలుగు సంవత్సరం ఉగాది సందర్భంగా తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పనుంది. రాష్ట్రంలో మరో 55,418 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం15 నెలల కాలంలో 61,579 పోస్టులను భర్తీ చేయాలని భావిస్తోంది.
ఖమ్మంలో అమానుష ఘటన జరిగింది. ఎదురుగడ్డ గ్రామంలో తాగొచ్చి వేధిస్తున్న కొడుకు రాజ్కుమార్ను తల్లి దూడమ్మ దారుణంగా హతమార్చింది. నిద్రలో ఉండగా తాళ్లు, కేబుల్ వైర్లతో కాళ్లు, చేతులు కట్టేసి ఊపిరాడకుండా చేసి చంపింది. దూడమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు.