విపక్షాల అవిశ్వాస తీర్మానంపై ఆనాడే ప్రధాని మోడీ జోస్యం
విపక్షాల అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోడీ 2019 లోనే జోస్యం చెప్పారు. నాడు తన ప్రభుత్వం పై అవి అవిశ్వాసం పెట్టినప్పుడు 2023 లో కూడా ఇలాగే జరుగుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ప్రభుత్వ వర్గాలు ఆ నాటి ఆయన ప్రసంగాన్ని మళ్ళీ బుధవారం గుర్తుకు తెచ్చాయి. మణిపూర్ అంశంపై మోడీ పార్లమెంటులో ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఆయన ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి.