ఆగని రచ్చ.. టీటీడీ ఛైర్మన్గా భూమన నియామకంపై చల్లారని మంటలు
టీటీడీ ఛైర్మన్గా భూమన కరుణాకర్రెడ్డి నియామకంపై మాటలు మంటలు కొనసాగుతున్నాయి. ఓ అన్యమతస్తుడిని పవిత్రమైన టీటీడీ ఛైర్మన్గా ఎలా నియమిస్తారని విపక్షాలు మండిపడుతున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు వైసీపీ టార్గెట్గా ఫైర్ అవుతున్నారు. ఇక రేపు(ఆగస్టు 10) టీటీడీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్న భూమన కరుణాకర్ రెడ్డి.. ఇప్పటికే జగన్ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.