Chandrababu Case:ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు, సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ల మీద వాదనలు ముగిసాయి. అనంతరం కోర్టు తీర్పును రిజర్వు చేసింది. సోమవారం చెబుతామని తెలిపింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు, సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ల మీద వాదనలు ముగిసాయి. అనంతరం కోర్టు తీర్పును రిజర్వు చేసింది. సోమవారం చెబుతామని తెలిపింది.
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ బెయిల్ పిటిషన్ల విచారణ నేడు ఏపీ హైకోర్టులోకి రానుంది. ముందస్తు బెయిల్ కోసం వీరు ఈ పిటిషన్లు వేశారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసు అతినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదని, అది ఎన్నికల కమీషన్ కిందకు వస్తుందని దాఖలైన పిటీషన్ను దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. గతంలో దీనిపై రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందని స్పష్టం చేస్తూ రేవంత్ రెడ్డి వేసిన పిటీషన్ను కొట్టివేసింది.
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన పిటిషన్ మీద ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు జరగనుంది. జాబితాలో చిట్టచివరి కేసుగా బాబు కేసును లిస్ట్ చేశారు.
ఏపీ హైకోర్టులో చంద్రబాబు మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ కావాలని లంచ్ మోషన్ పిటిషన్ను చంద్రబాబు తరపు న్యాయవాదులు వేశారు. దీన్ని మధ్యాహ్నం విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరిన్ని చిక్కులు తప్పేట్టు లేవు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసుపై సమగ్ర దర్యాప్తు జరపాలంటూ మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసును సీబీఐతో విచారించాలని ఆయన కోరారు. ఈ కేసు ఇవాళ హైకోర్టులో విచారణకు రానుంది.
స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు దాఖలు చేసిన ఎస్ఎల్పీపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను గత శుక్రవారం హైకోర్టు కొట్టివేయడంతో శనివారం ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డికి హైకోర్టు 10వేల రూపాయల జరిమానా విధించింది. 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సమయంలో ఎమ్మెల్యే సునీత ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తుల వివరాలను పూర్తిగా వెల్లడించ లేదంటూ ఆమెపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.