AP CEO: ఎందుకింత నిర్లక్ష్యం.. ఆ మూడు జిల్లాల ఎస్పీలకు ఈసీ వార్నింగ్!
నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల ఎస్పీలతో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి సమావేశం ముగిసింది. శాంతిభద్రతల పరిరక్షణలో ఎందుకింత నిర్లక్ష్యం వహించారని వారిని సీఈఓ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. హత్యలు జరిగే పరిస్థితులు ఏర్పడడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.