NEET-UG: నీట్ యూజీ పరీక్షపై విచారణ వాయిదా
నీట్ యూజీ పరీక్షపై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ నెల 18న విచారణ చేపడుతామని ధర్మాసనం తెలిపింది. పేపర్ లీకేజిపై దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్ లో కోర్టుకు సీబీఐ సమర్పించింది. ప్రశ్నాపత్రం లీకేజి విస్తృత స్థాయిలో జరగలేదని సీబీఐ కోర్టుకు తెలిపింది.