AP Politics:మరికాసేపట్లో టీడీపీ-జనసేన జేఏసీ రెండో సమావేశం
టీడీపీ, జనసేన జేఏసీ సభ్యులు ఈరోజు సమావేశం కానున్నారు. ఉమ్మడిగా పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పన అంశాలే ప్రధాన అజెండాగా సమావేశం జరగనుంది. మరికాసేపట్లో ఇది ప్రారంభం కానుంది.
టీడీపీ, జనసేన జేఏసీ సభ్యులు ఈరోజు సమావేశం కానున్నారు. ఉమ్మడిగా పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పన అంశాలే ప్రధాన అజెండాగా సమావేశం జరగనుంది. మరికాసేపట్లో ఇది ప్రారంభం కానుంది.
చంద్రబాబు ప్రజల మనిషని, ఎల్లప్పుడూ జనాల కోసమే పని చేశారని అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. ఈరోజు జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో తన తండ్రి గురించి చెబుతూ లోకేశ్ కంటతడి పెట్టుకున్నారు. వైసీపీ ప్రభుత్వం, నేతలు తనను, తన తల్లిని, భార్యను రోడ్డున పడేశారని మండిపడ్డారు.
2040నాటికి భారతీయుడు చంద్రుడిపై కాలుమోపేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని ప్రధాని మోదీ శాస్త్రవేత్తలకు సూచించారు. మన సొంతంగా భారత అంతరిక్ష కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసేకునే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలన్నారు. భారత్ యొక్క గగన్యాన్ మిషన్ పురోగతిని అంచనా వేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయత్నాల భవిష్యత్తు రూపురేఖల తయారీకి సంబంధించి చర్చించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ నోరుజారారు. దీంతో బీజేపీ రాహుల్ ను టార్గెట్ చేసింది. ఛత్తీస్ గఢ్ లో తమ పార్టీ ప్రభుత్వం పడిపోతుందని రాహుల్ టంగ్ స్లిప్ అయ్యింది. దీంతో బీజేపీ రాహుల్ పై ఎదురుదాడికి దిగింది. కాంగ్రెస్ అధినేత ఓటమిని అంగీకరించారంటూ సెటైర్లు వేస్తోంది. రాహుల్ జీ ...మీ ఓటమిని ఒప్పుకున్నారు అంటూ బీజేపీ ఎద్దేవా చేస్తోంది.
ఐదు రాష్ట్రాల పరిశీలకులతో ఎన్నికల సంఘం ఈ రోజు ఢిల్లీలో సమావేశం కానుంది. త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల తేదీలు ప్రకటించిన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానుంది.
ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ లారెన్స్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం చంద్రముఖి2. రజినీకాంత్ హీరోగా, దాదాపు 17ఏళ్ళ క్రితం వచ్చిన చంద్రముఖి సినిమాకి ఇది సీక్వెన్స్ కావడం విశేషం. సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మూవీ టీమ్ అధికారిక ప్రకటన చేసింది.
తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనలో మార్పులు చోటుచేసుకున్నాయి. అక్టోబర్ 2వ తేదీన మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించాల్సి ఉండగా దాన్ని రెండు రోజుల ముందుకు అంటే సెప్టెంబర్ 30 కు మార్చారు. మహబూబ్ నగర్ లో బీజెపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో మోదీ మాట్లాడనున్నారు.
ఢిల్లీలో మూడు రోజులుగా జరుగుతున్న తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసింది. తెలంగాణ నుంచి పోటీ చేసే అభ్యర్ధుల లిస్ట్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. సర్వేలు, గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్ధులనే ఎంపిక చేసినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని టీడీపీ శాసనసభాపక్షం నిర్ణయం తీసుకుంది. ఈరోజు మీట్ అయిన టీడీఎల్పీ చంద్రబాబు అరెస్ట్, తరువాత పరిణామాల మీద చర్చించింది. చంద్రబాబు అరెస్ట్ మీద సభలో పోరాడాలని నిర్ణయం తీసుకుంది.