డిసెంబర్ లోనే లోక్ సభ ఎన్నికలు.... మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు...!
పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది డిసెంబర్లోనే లోక్ సభ ఎన్నికలను నిర్వహించేందుకు బీజేపీ రెడీ అవుతోందని ఆమె అన్నారు. క్యాంపెయిన్ కోసం ఇప్పటికే అన్ని హెలికాప్టర్లను కమల నాథులు బుక్ చేశారని వెల్లడించారు. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఈ సారి దేశం 'నిరంకుశ' పాలనను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.