Hyderabad : మల్లారెడ్డి మమ్ములను ముంచిండు.. ప్రజావాణిలో 700 మంది బాధితుల ఫిర్యాదు
ఈ రోజు ప్రజాభవన్ లో నిర్వహించిన ప్రజావాణికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై భారీ ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. గుండ్ల పోచంపల్లిలో తమ భూమిని మల్లారెడ్డి కబ్జా చేశాడంటూ దాదాపు 700 మంది ర్యాలీగా వచ్చి దరఖాస్తులు ఇచ్చారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.