వరదల్లో ఎస్ఐ సాహసోపేత రెస్య్కూ ఆపరేషన్.. మెడల్ కి సిఫార్సు చేసిన ఏపీ సీఎం
స్థానిక ఎస్ఐ వెంకటేష్ రెస్క్యూ ఆపరేషన్ సాహసోపేతంగా నిర్వహించారని, గత ఏడాది భీకరంగా వచ్చిన గోదావరి వరదల్లో కూనవరం సమీపంలోని దాదాపు 4-5వేలమంది గ్రామస్తులను తరలించడంలో కీలక పాత్ర పోషించారని సీఎం ఎదుటే స్థానికులు మెచ్చుకున్నారు. చాలా మంది ప్రాణాలను ఎస్ఐ కాపాడాలరని కొనియాడారు. స్థానికుల స్పందనతో సమానంగా సీఎం జగన్ కూడా స్పందించారు. గత ఏడాది, ఈ ఏడాది వచ్చిన గోదావరి వరదల్లో సాహసోపేతంగా రెస్యూ ఆపరేషన్స్ నిర్వహించిన కూనవరం ఎస్ఐను ముఖ్యమంత్రి అభినందించారు.