Korutla Deepthi Case: కోరుట్ల దీప్తి మృతి కేసులో దొరికిన చెల్లి చందన!
జగిత్యాల జిల్లా కోరుట్లలో సంచలనం సృష్టించిన దీప్తి మృతి కేసులో మిస్టరీ వీడనుంది. హైదరాబాద్లో చందన, ఆమె బాయ్ఫ్రెండ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీప్తి మృతి తర్వాత 40 తులాల బంగారం, రెండు లక్షల రూపాయలను తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నగదు, బంగారంతో పాటు పాస్ పోర్టు కూడా తీసుకెళ్లడంతో ఆమె విదేశాలకు వెళ్లకుండా పోలీసులు లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు.