Congress Party: ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కీలక స్థానం కల్పించిన అధిష్టాం..
నల్లగొండ జిల్లాలో కీలక నేత అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసంతృప్తికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం తీసుకుంది పార్టీ అధిష్టానం. ఆయనకు అత్యంత కీలక బాధ్యతలు అప్పగించింది. ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలోకి తీసుకుంది. ఆయనను మాత్రమే కాదు.. మరో సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ను కూడా స్క్రీనింగ్ కమిటీలోకి తీసుకుంది పార్టీ అధిష్టానం.