Kerala Blasts: కేరళ పేలుళ్లపై కొనసాగుతున్న దర్యాప్తు.. ఆ కేంద్రమంత్రిపై కేసు నమోదు..
కేరళ పేలుళ్లకి సంబంధించి వివిధ వర్గాల మధ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్పై కేసు నమోదైంది. ఆదివారం కేరళలో జరిగిన పేలుళ్లపై ఇటీవల మాట్లాడిన రాజీవ్.. కేరళలో సంఘ విద్రోహ శక్తులు బలపడుతున్నాయని.. ముఖ్యమంత్రి విజయన్ వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన సీఎం.. రాజీవ్ చేసిన వ్యాఖ్యల్లో మతపరమైనా అజెండా ఉందంటూ కౌంటర్ వేశారు .