Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తా: పవన్
ఉత్తరాంధ్ర భూములను వైసీపీ నేతలు దోచేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. అనకాపల్లి నియోజకవర్గం బయ్యారం రెవెన్యూ డివిజన్ విస్సన్నపేట గ్రామంలో ఆక్రమణలకు గురైన భూములను పరిశీలించారు.