బార్బడోస్ వేదికగా వన్డే మ్యాచ్లో తలపడనున్న భారత్-విండీస్
టెస్ట్ సిరీస్ను నెగ్గిన ఉత్సాహంతో టీమ్ ఇండియా వన్డే సిరీస్ కోసం రంగంలోకి దిగనుంది.భారత్ - వెస్టిండీస్ (IND Vs WI) జట్ల మధ్య మరో సిరీస్ స్టార్ట్ కానుంది.ఈ సమరంలో వెస్టిండీస్ని ఎదుర్కొనేందుకు భారత్ అన్నివిధాలుగా సన్నద్ధమైంది.మూడు వన్డేల సిరీస్లో భాగంగా బుధవారం (27-07-2023) బ్రిడ్జ్టౌన్లోని బార్బడోస్ వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరగనుంది.టెస్టు సిరీస్ విజయంతో విండీస్ పర్యటనను ప్రారంభించిన టీమ్ఇండియాకు ఇప్పటివరకు పెద్దగా పోటీ ఎదురుకాలేదు.విండీస్ని కొట్టేందుకు భారత్ పోరు కొనసాగించనుంది.