Bumrah returns as captain: బుమ్రా T-20 సిరీస్కు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.గతంలో ఇంగ్లండ్తో జరిగిన ఒక టెస్టులో బుమ్రా భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. కీలకమైన ఆసియా కప్, ప్రపంచకప్కు ముందు బుమ్రా మ్యాచ్ ఫిట్నెస్ స్థాయిని పరీక్షించేందుకు పెద్దగా ప్రెషర్ లేని జట్టుతో జరిగే సిరీస్లో ఆడించబోతున్నారు.ఈ నేపథ్యంలో ఓవైపు టీమిండియా ఫ్యాన్స్ బుమ్రా ఎంట్రీపై హర్షం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు మాత్రం వన్డే ప్రపంచకప్-2023 లాంటి మెగా ఈవెంట్కు ముందు కెప్టెన్సీతో ప్రయోగాలు ఎందుకంటూ తమ ఒపీనియన్ని డైరెక్ట్గానే చెబుతున్నారు. ఐర్లాండ్ బలహీన జట్టే కావొచ్చు కానీ దాదాపు ఏడాది తర్వాత రీ -ఎంట్రీ ఇవ్వబోతున్న బుమ్రాపై అదనపు భారం మోపడం కరెక్ట్ కాదనే వాదనలు వినిపిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..కెప్టెన్గా బుమ్రా రీ-ఎంట్రీ, రిస్క్ అవసరమా అంటున్న విశ్లేషకులు..
భారత స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు వెన్నుగాయం కావడంతో జట్టుకు దూరం అయ్యాడు. చాలాకాలం గ్యాప్ తర్వాత క్రికెట్ పిచ్లోకి మళ్లీ రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.ఇప్పుడు పూర్తిగా కోలుకొని బుమ్రా గేమ్కు రెడీ అయిపోయాడు.ఐర్లాండ్తో జరిగే 3 మ్యాచ్ల T-20 సిరీస్ కోసం అతడిని సెలక్టర్లు ఎంపిక చేశారు.ఈ టైంలో బుమ్రా రిస్క్ చేయడం అంత అవసరమా అంటూ విశ్లేషకులు సలహాలు ఇస్తున్నారు.
Translate this News: