IND vs AUS : వర్షం కారణంగా మ్యాచ్కు అంతరాయం...నిలిచిపోయిన ఆట..!!
భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్ల ODI సిరీస్లో రెండవ మ్యాచ్ ఈ రోజు జరుగుతోంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ కు అంతరాయం వాటిల్లింది. భారత ఇన్నింగ్స్ 10వ ఓవర్ లో వర్షం పడింది. దీంతో మ్యాచ్ ను నిలిపివేశారు. 9.5ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 79/1గా ఉంది. రుతురాజ్ (8)ఔట్ అయ్యాడు. ప్రస్తుతం శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ క్రీజులో ఉన్నారు.