Ind Vs Aus: కంగారులకు మూడినట్టే.. ఇక కాస్కో స్మిత్.. మా వాడితో మాములుగా ఉండదు మరి!
టీమిండియా స్పిన్నర్ అశ్విన్ నెట్ సెషన్లో తీవ్రంగా కష్టపడుతున్నాడు. ఆస్ట్రేలియాపై ఈ నెల 8న భారత్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఇప్పటికే గెలుపు వ్యూహాలను సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. చెన్నై వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో ముగ్గురు స్పిన్నర్లను ఆడించాలని రోహిత్ భావిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా స్పిన్నర్ అశ్విన్తో తొలి ఓవర్ వేయించి వార్నర్తో పాటు స్మిత్కి చెక్ పెట్టాలని ప్లాన్ వేసినట్టు ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.