భరత్ కెనడా మధ్య భగ్గుమన్న విబేధాలు
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తముందనే ఆరోపణలు కొట్టిపారేయాలేమని.. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా మరోసారి నోరుపారేసుకున్నారు. విదేశీ ప్రభుత్వాల చట్టవిరుద్ధమైన చర్యల నుంచి కెనడా పౌరులను రక్షించే బాధ్యత మాపై ఉందన్నారు.
ఇటీవల భారత్, కెనడా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాజాగా ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది. కెనడా పౌరుల కోసం వీసా సేవలు పునరుద్దరిస్తున్నట్లు పేర్కొంది. ఎంట్రీ, బిజినెస్, మెడికల్ వీసాలు అలాగే కాన్ఫరెన్స్ వీసాలను జారీ చేస్తున్నట్లు తెలిపింది. భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటిదాకా వీసా సేవలు తాత్కాలికంగా నిలిపివేశామని.. వీటిపై సమీక్ష చేసిన అనంతరం ఈ సేవల్ని పునరుద్ధరిస్తున్నామని స్పష్టం చేసింది.