Modi independence day speech: ఎర్రకోటపై పదోసారి ప్రధాని మోదీ.. ఏం అన్నారంటే?
మణిపూర్ హింసతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారన్నారు మోదీ. ఎర్రకోట వేదికగా స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో మణిపూర్ అంశాన్ని మోదీ ప్రస్తావించారు. త్వరలోనే అక్కడశాంతి నెలకొంటుదని తెలిపారు. కరోనాసంక్షోభం తరువాత ప్రపంచానికి భారత్ పై సరికొత్త విశ్వాసం నెలకొందని మోదీ చెప్పారు. 10 ఏళ్ల క్రితం రాష్ట్రాలకు రూ. 30 వేల కోట్లు ఇస్తే.. ఇప్పుడు రాష్ట్రాలకు రూ. 100 కోట్లు ఇవ్వగలుగుతున్నామని చెప్పారు. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపులు ఈ మూడింటిని వదిలించుకోవాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.