జలమయమైన లోతట్టు ప్రాంతాలు..
హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, కోఠి, ఉప్పల్, కూకట్ పల్లితోపాటు పలు ప్రాంతాలు జలయమం అయ్యాయి. మరో 2 గంటలపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వానకు తడుస్తూనే గణపతికి పూజలు చేస్తున్నారు భక్తులు.
ఏపీకి మరోసారి వానగండం పొంచి ఉందని వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.దీని ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరికలు జారీ చేశారు.
భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సోమవారం సెలవు ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు.
భారీ వర్షాలకు వాగులు పొంగి రోడ్లన్నీ జలమయమయ్యాయి. కోదాడ జగ్గయ్యపేట వద్ద రోడ్డు బ్లాక్ కావడంతో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. మిర్యాలగూడ, గుంటూరు మీదుగా విజయవాడకు వెళ్లాలని పోలీసులు తెలిపారు.
భారీ వర్షాలకు విజయవాడలోని మొగల్రాజపురం వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ బాలిక మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
హైదరాబాద్లో హైడ్రా దూకుడు కొనసాగుతోంది. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని గగన్పహాడ్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. అప్పా చెరువు FTLలో నిర్మించిన బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్రెడ్డి కట్టడాలను కూల్చివేస్తున్నారు.