MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు(శుక్రవారం) విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఆమె బినామిగా పేర్కొంటున్న రామచంద్రన్ పిళ్లై అప్రూవర్గా మారిన వెంటనే నోటీసులు రావడం చర్చనీయాంశమైంది.