వీల్చైర్పై రాజ్యసభకు మన్మోహన్ సింగ్.. సిగ్గుమాలిన చర్య అంటూ కాంగ్రెస్ని తిట్టిపోస్తున్న బీజేపీ!
90 ఏళ్ల వయసులో.. అది కూడా ఆరోగ్యం బాగోలేనప్పుడు మన్మోహన్ సింగ్ రాజ్యసభకు హాజరుకావడం ప్రతిపక్షాలు, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఈ వయసులో ఒక్క ఓటు కోసం ఆరోగ్యం బాగోని మన్మోహన్సింగ్ని సభకు రప్పించారని..ఇది సిగ్గుచేటు అని బీజేపీ విమర్శలు గుప్పిస్తుండగా.. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి మన్మోహన్ సింగ్ వచ్చారని.. ఇది ఆయన నిబద్ధతకు నిదర్శనమని కమల పార్టీ వ్యాఖ్యలను తిప్పికొట్టింది.