Liquor Scam : కేజ్రివాల్ కు షాక్ ఇచ్చిన ఈడీ.. నేడే విచారణ!
ఢిల్లీ సీఎం కేజ్రివాల్ కు ఈడీ షాక్ ఇచ్చింది. లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే పలు సార్లు విచారణకు డుమ్మా కొట్టిన కేజ్రివాల్ ను నేడు విచారణకు హాజరుకావాల్సిందిగా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈడీ జారీ చేసిన సమన్లపై స్టే ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టులోని సెషన్స్ కోర్టు నిరాకరించింది.