Covid New Variant: దేశంలో కరోనా కొత్త వేరియంట్ కలకలం.. లక్షణాలివే!
ప్రపంచ దేశాలతోపాటు మనదేశంలోనూ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడు మరోసారి మనవాళిని భయపెడుతోంది. కోవిడ్ వేరియంట్ జేఎన్ 1 భారత్ లోనూ బయటపడటం కలకలం రేపుతోంది. 24గంటల్లో కొత్తగా 260 కేసులు నమోదు అవ్వగా...ఐదుగురు మృతి చెందారు. కేరళలో నలుగురు..యూపీలో మరొకరు మరణించారు.