Revanth Reddy: మోదీ చెప్పిన విషయాన్ని మేం ఎప్పుడో చెప్పాం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న రేవంత్
తెలంగాణలో బీజేపీ-బీఆర్ఎస్ మధ్య ఉన్నది ఫెవికాల్ బంధమన్న విషయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ సాక్షిగా మరోసారి స్పష్టం చేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వారిద్దరు చీకటి మిత్రులు, ఢిల్లీలో దోస్తీ – గల్లీలో కుస్తీ అని తాము మొదటి నుండి చెబుతున్నదే నిజం అని మోదీ మాటల ద్వారా సుస్పష్టంగా తేలిందన్నారు.