Gudivada : మానవత్వం, కనికరం లేని క్రూరుడు.. చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్
ఈ రోజు దొండపాడులో ఎమ్మెల్యే కొడాలి నాని పర్యటించారు. కోటి 43 లక్షల నిధులతో నిర్మించిన తాగునీటి ప్రాజెక్ట్ లను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో చంద్రబాబు మానవత్వం, కనికరం లేని క్రూరుడంటూ మండిపడ్డారు. రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణ పీడను శాశ్వతంగా అంతమొందించాలన్నారు.