జాతీయ జెండాను ఆవిష్కరించిన చంద్రబాబు-LIVE
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసుపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసును సీబీఐ, ఈడీకి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్పై ఈరోజు ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. దీనికి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.
పిఠాపురంలో జనసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. స్థానికంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్పై స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటో పెట్టకపోవడంపై నిరసనకు దిగారు. ఎన్టీఆర్, చంద్రబాబుతో పాటు పవన్ ఫొటో కూడా పెట్టాలని డిమాండ్ చేశారు.
వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా విద్యా వ్యవస్థ గాడి తప్పిందని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డి పాలెంలో ఆమె మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసిన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో ఇకపై ఉపాధ్యాయుల కొరత ఉండదన్నారు.
సీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు భేటీ అయ్యారు. ప్రపంచంలోని ఉత్తమ ప్రమాణాలు, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని అమరావతి నిర్మాణం చేపడుతున్నట్లు సీఎం వారికి వివరించారు. ఈ బృందంలో వరల్డ్ బ్యాంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సీనియర్ స్పెషలిస్ట్ రఘు కేశవన్ తదితరులు ఉన్నారు.
చంద్రబాబు బిర్యానీ పెడతా అన్నాడని ప్రజలు ఆశపడ్డారని మాజీ సీఎం జగన్ అన్నారు. కానీ ఇప్పుడు పస్తులు ఉంటున్నారన్నారు. తానే సీఎంగా ఉండి ఉంటే.. రైతు భరోసా, అమ్మ ఒడి తదితర పథకాల డబ్బులు విడుదల అయ్యి ఉండేదన్నారు. విశాఖ నేతలతో జగన్ ఈ రోజు సమావేశమయ్యారు
కాకినాడ జిల్లా ధవళేశ్వరంలో మారోజు వెంకటేష్ అనే ట్యూషన్ టీచర్ ఇద్దరు విద్యార్థులను కిడ్నాప్ చేశాడు. 15 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధిత విద్యార్థుల తల్లి ఆరోపిస్తోంది.
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్టుల జారీ ప్రక్రియ త్వరలోప్రారంభం కానుంది. వివాహ నమోదు ధ్రువీకరణ పత్రం ఆధారంగా వీటిని జారీ చేసే విధానాన్ని త్వరలోనే రాష్ట్రంలో అమలు చేయనున్నారు.జగన్ బొమ్మ, వైసీపీ రంగులతో ఉన్న కార్డులను కూడా మార్చాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.