Nara Lokesh: బిగ్ బ్రేకింగ్.. హైకోర్టులో లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్
ఏపీ హైకోర్టులో నారా లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్ ను నారా లోకేష్ దాఖలు చేశారు.
ఏపీ హైకోర్టులో నారా లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్ ను నారా లోకేష్ దాఖలు చేశారు.
స్కిల్ డెవలెప్మెంట్ కేసులో అక్రమంగా చంద్రబాబును అరెస్టు చేశారు గానీ.. ఇప్పటికీ ఒక్క ఆధారమూ చూపించలేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. రూ.371కోట్లు దారిమళ్లించారని చెప్తున్నారని, కానీ అ డబ్బులు అసలు ఎక్కడికి వెళ్లాయో నిరూపించడం లేదన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భేటీ అయ్యారు. లోకేష్తో పాటు టీడీపీ ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్ కూడా ఉన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు.
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్తో మాకేం సంబంధం అని తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ర్యాలీలు, ధర్నాలు చేస్తే ఏపీలో చేయాలి కానీ.. తెలంగాణలో చేయడం ఏంటని ప్రశ్నించారు.
చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. సుప్రీంకోర్టులోనూ చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఈ రోజుకు విచారణకు రాలేదు. రేపు ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.
నేడు ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లకు సంబంధించిన విచారణ వాయిదా పడే అవకాశం ఉంది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సెలవుపై వెళ్లడంతో ఈ విచారణ రేపు జరిగే అవకాశం ఉందని సమాచారం.
చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటీషన్ ల పై విచారణను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. కస్టడీ పిటీషన్ ముందు విచారణ చేయాలని సిఐడీ తరపు న్యాయవాదులు వాదించారు. బెయిల్ పై ముందు విచారణ చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు పట్టుపట్టారు. ఇరువైపులా తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకోవడంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబును సీఐడీ కస్టడీ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. నిన్న సాయంత్రమే చంద్రబాబు కస్టడీ ముగియగా.. నేడు విచారణకు వచ్చింది క్వాష్ పిటిషన్ దాంతో.. హైకోర్టు ఆ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.
చంద్రబాబు క్వాష్ పిటిషన్ను అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు(Supreme Court) నిరాకరించింది. ఈ పిటిషన్ను మంగళవారం మరోసారి మెన్షన్ చేయాలని సూచించారు సీజేఐ చంద్రచూడ్. చంద్రబాబుపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలంటూ ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.