భరత్ కెనడా మధ్య భగ్గుమన్న విబేధాలు
నిజ్జర్ హత్య తరువాత కెనడాలో సిక్కులు అభద్రతకు లోనవుతున్నారన్న ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు.తమ పౌరులకు భద్రత కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన భరోసా ఇచ్చారు. శనివారం సిక్కుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య అంశంపై కెనడా ప్రభుత్వం చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా తోసిపుచ్చింది. తీవ్రవాద శక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా గతేడాది జూన్ 18న ఖలిస్తాన్ అనుకూల మద్దతుదారు హర్దీప్ సింగ్ ను కెనడాలో గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. అయితే దీంట్లో భారత్ ప్రమేయం ఉందని కెనడా పార్లమెంట్ లో ఆ దేశ ప్రధాని ప్రకటించారు. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది.