నూహ్ అల్లర్లపై పీఎం నోరువిప్పుతారా? ముస్లింలకు ఏం సందేశం ఇస్తారు? ఓవైసీ సూటిప్రశ్న...!
హర్యానాలోని నూహ్లో అల్లర్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అక్రమ కట్టడాల కూల్చివేతను ఏఐసీసీ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో దీనికి వ్యతిరేకంగా ప్రధాని మోడీ ప్రసంగిస్తారని తాను ఆశిస్తున్నట్టు ఓవైసీ వెల్లడించారు. ప్రధాని మోడీ సబ్ కా సాథ్, సబ్ వికాస్, సబ్ కా విశ్వాస్ నినాదం ఇప్పుడు ఎక్కడ ఉందన్నారు.