Health Tips: ఈ ఐదు పండ్లు తింటే రోగాలు పరార్.. అవేంటంటే?
వాతావరణంలో మార్పుల కారణంగా..వైరల్, బ్యాక్టీరియల్ ఇన్పెక్షన్లు ఇబ్బంది పెడుతుంటాయి. ప్రతిఒక్కరూ దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులతో ఇబ్బంది పడుతుంటారు. అక్టోబర్ నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో వాతావరణంలో మార్పుల కారణంగా ఎంతో మంది రోగాల బారిన పడ్డారు. ఇప్పుడు చలి కూడా మొదలుకానుంది. అందువల్ల చాలా మందిలో వైరల్, ఫ్లూ, కళ్లు,ముక్కు, దగ్గు వంటి సమస్యలు పెరుగుతాయి. నిజానికి బలహీనమైన రోగనిరోధకశక్తి ఉన్నవారిలో ఇలాంటి వ్యాధులు వెంటనే ప్రభావం చూపిస్తాయి. రోగనిరోధక వ్యవస్థ బయటి సూక్ష్మ క్రిములను శరీరంలోకి ప్రవేశించనివ్వదు. కానీ వాతావరణంలో మార్పులు, గాలిలో తేమ పెరిగిన వైరస్ లు, బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారిపై దాడి చేస్తాయి. అయితే వీటిని నివారించేందుకు పండ్లు ఎంతో సహాయపడతాయి.