Ayodhya Ram Mandir : శ్రీరాముడి ఫొటోలు లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోండి.. సీరియస్ అయిన ట్రస్ట్..
అయోధ్య రామమందిరంలోని గర్భగుడిలోకి తీసుకొచ్చిన బాలరాముడి విగ్రహం పూర్తి రూపం కనిపించేలా ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సీరియస్ అయ్యింది. దీనిపై విచారణ చేసి.. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.