AP : ఏపీలో ఆసక్తికర చర్చ.. ఆ రెండు ఎమ్మెల్సీల సీట్లు మళ్లీ వాళ్లకే ఇస్తారా?
ఏపీలో కొత్త ఎమ్మెల్సీలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. టీడీపీ, జనసేన చెరో సీటు తీసుకుంటాయా.. లేదంటే టీడీపీనే రెండు తీసుకుంటుందా అనే ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఎమ్మెల్సీలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది.