YS Sharmila: షర్మిల పార్టీలోకి వస్తే తప్పకుండా ఆహ్వానిస్తాం: ఏపీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె కాంగ్రెస్ పార్టీలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్దరాజు వివరించారు. పార్టీ సిద్దాంతాలు, భావాలు నచ్చి ఎవరు వచ్చినా ఆహ్వానం పలుకుతామని తెలిపారు.