మరోసారి ఉదారత చాటుకున్న జగన్!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఓ గ్రామీణ పేద విద్యార్థి కలను సాకారం చేసేందుకు మరోసారి ఆర్థిక భరోసా అందించారు. పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి అమెరికాలో ఫ్లోరిడాలో కమర్షియల్ పైలెట్ శిక్షణకు ఎంపికయ్యారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఓ గ్రామీణ పేద విద్యార్థి కలను సాకారం చేసేందుకు మరోసారి ఆర్థిక భరోసా అందించారు. పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి అమెరికాలో ఫ్లోరిడాలో కమర్షియల్ పైలెట్ శిక్షణకు ఎంపికయ్యారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.చిత్తూరు జిల్లా పర్యటనలో పెద్దిరెడ్డిపై చంద్రబాబు ఫైర్ అయిన సంగతి తెలిసిందే. చంద్రబాబు పెద్దిరెడ్డిని నిలదీస్తూ ఏం పుంగనూరు పుడింగివా అంటూ బాబు పెద్దిరెడ్డిని నిలదీశారు. అంతే కాకుండా చంద్రబాబుని పుంగనూరులో అడుగు కూడా పెట్టనివ్వలేదు.
గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తరాఖండ్ లో జనజీవనం స్తంభించిపోయింది. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో జరిగిన వేరువేరు ఘటనల్లో సుమారు 31 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.
వైసీపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద తీవ్ర విమర్శలు చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు చేశారు.
వారాంతంలోనే అనుకుంటే వారం మధ్య రోజుల్లో కూడా తిరుమల శ్రీవారి రద్దీ తగ్గడం లేదు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది.
లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ మరి కొద్ది రోజుల్లో వైసీపీలో చేరతారనే మాటలు జోరుగా వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం విజయవాడలో జరిగిన ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకల్లో జగన్ తో కలిసి జేపీ వేదిక పంచుకున్నారు.
ఏలూరు జిల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకం వద్ద తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు సెల్ఫీ తీసుకుని వైసీపీ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరారు.గత ప్రభుత్వ హయాంలో రూ.4,909 కోట్లతో చింతలపూడి ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టినట్టు చంద్రబాబు వెల్లడించారు.
ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్, వన్ టౌన్ సీఐ వెంకట రమణ లు నాతో నగ్న పూజలు చేయించి నన్ను వేధిస్తున్నారంటూ ఓ మహిళ విడుదల చేసిన వీడియోలు ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో కాకపుట్టిస్తుంది
కొత్త కారు కొన్న అన్న సంతోషంలో స్నేహితులకు పార్టీ ఇచ్చాడు ఓ వ్యక్తి . పార్టీలో ఫుల్ గా తాగారు. తిన్నారు. ఆ మత్తులో కారును నడపడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.మరొకరికి తీవ్రగాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది.