చంద్రబాబు లాయర్ సిద్ధార్ధ్ లూథ్రా మరో ట్వీట్
చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసు వాదిస్తున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా మరోసారి ట్వీట్ చేశారు. బాబు వేసిన పిటిషన్ హైకోర్టులో కొట్టేసిన నేపథ్యంలో ఈ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంటోంది.
చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసు వాదిస్తున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా మరోసారి ట్వీట్ చేశారు. బాబు వేసిన పిటిషన్ హైకోర్టులో కొట్టేసిన నేపథ్యంలో ఈ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంటోంది.
ఏసీబీ కోర్టు కీలక తీర్పునిచ్చింది. చంద్రబాబుకు రిమాండ్ను మరో రెండు రోజులు పొడిగించింది. మరో రెండు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలోనే ఉంటారంటూ కోర్టు జడ్జి ప్రకటించారు.
టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మంత్రి రోజా మాస్ వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీలో ఓవర్ యాక్షన్ చేస్తే ఎవరూ చూస్తూ ఊరుకోరని అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడిన మంత్రి రోజా.. అసెంబ్లీలో బాలకృష్ణ మీసం మెలేయడంపై సీరియస్గా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని టీడీపీ శాసనసభాపక్షం నిర్ణయం తీసుకుంది. ఈరోజు మీట్ అయిన టీడీఎల్పీ చంద్రబాబు అరెస్ట్, తరువాత పరిణామాల మీద చర్చించింది. చంద్రబాబు అరెస్ట్ మీద సభలో పోరాడాలని నిర్ణయం తీసుకుంది.
చంద్రబాబు అరెస్ట్ మీద ఆంధ్రా ఎంపీలు మాటల యుద్ధం చేసుకున్నారు. అది అక్కడతో ఆగకుండా తరువాత ట్విట్టర్ కు కూడా పాకి చిలిక చిలికి గాలివాన అయింది. బాడీషేమింగ్, వ్యక్తిగత దూషణ స్థాయికి దిగజారింది.
టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో వేసిన క్వాట్ పిటిషన్ మీద హైకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. అలాగే మరో రెండు బెయిల్ పిటిషన్ల మీద కూడా ఏసీబీ కోర్టులో విచారణకు రానున్నాయి. బెయిల్ కనుక మంజూరు అయితే బాబు ఈరోజు బయటకు వస్తారు. దీంతో అందరి దృష్టి ఇప్పుడు విచారణ మీదనే ఉంది.
రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు ఆయన కుటుంబసభ్యులు భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి కలిశారు. వారితో మాజీ మంత్రి యనమల రామకృష్ణ కూడా ఉన్నారు.
ఆంధప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు అనే చెప్పొచ్చు. అందుకే అంతటా ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు. వైసీపీకి చెక్ పెట్టేందుకే ఇప్పుడు టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే అయినా టీడీపీ, జనసేన పార్టీల్లో ఈ పొత్తు ఎవరికి ఎక్కువ లాభం అని తెగ చర్చించేసుకుంటున్నారు. క్రితం ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు గెలచుకుని నవ్వులు పాలైన జనసేన ఈసారి అయినా టీడీపీ పొత్తుతో కనీస గౌరవనీయమైన స్థానాలు సంపాదించుకోవచ్చని అనుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అవడంపై రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. ఆయన తప్పు ఉంది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారని అన్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కావడంతో గౌరవం ఇచ్చామని, ఆ గౌరవంతోనే జైలుకు తరలించేందుకు చాపర్ కూడా ఏర్పాటు చేశామన్నారు.