Amartya Sen: ఆమర్త్య సేన్ చనిపోయారంటూ తప్పుడు ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన కూతురు..!
భారత ఆర్థిక వేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆమర్త్యసేన్ ఇక లేరంటూ సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారానికి తెరలేపారు కొందరు దుండగులు. దాంతో ఒక్కసారిగా అంతా హతాశులయ్యారు. అయితే, ఈ ప్రచారంపై ఆమర్త్యసేన్ కూతురు స్పందించారు. ఆమర్త్యసేన్ ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన క్షేమంగానే ఉన్నారంటూ క్లారిటీ ఇచ్చారు.