చిరుతపులి భయం ఎఫెక్ట్.. బోసిపోయిన అలిపిరి కాలినడక మార్గం!
తిరుమల అలిపిరి మెట్ల మార్గం బోసిపోయింది. చిరుతపులి ఎఫెక్ట్తో భక్తులు కాలినడకన వచ్చేందుకు భయపడుతున్నట్టు సమాచారం. కొన్ని రోజుల క్రితం 6ఏళ్ల లక్షితను చిరుత చంపేసిన తర్వాత భక్తుల ఆలోచనా తీరులో మార్పు కనిపిస్తోంది. ఇప్పటికే మూడు చిరుతపులులను టీటీడీ పట్టుకుంది. మిగిలిన వాటిని కూడా పట్టుకోని దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలేసేందుకు మహారాష్ట్ర నుంచి బోనులను తీసుకొచ్చింది.