Aiadmk: తమిళనాడులో కీలక పరిణామం.. ఎన్డీఏతో పొత్తుకు అన్నాడీఎంకే గుడ్ బై
సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలలు ముందు తమిళనాడులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో పొత్తును తెగతెంపులు చేసుకున్నట్లు అన్నాడీఎంకే సంచలన నిర్ణయం ప్రకటించింది. చెన్నైలో జరిగిన అన్నాడీఎంకే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు.