AP: మాజీ మంత్రి తనయుడి బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా..!
మాజీ మంత్రి జోగి రమేశ్ తనయుడు జోగి రాజీవ్ ACB కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అరెస్ట్ అయిన జోగి రాజీవ్ ప్రస్తుతం విజయవాడలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు కౌంటరు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది.