Andhra Pradesh: అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలుడు..18 కి చేరిన మృతుల సంఖ్య!
అచ్యుతాపురం ఫార్మా సెజ్ లో రియాక్టర్ పేలిన ఘటన లో చనిపోయిన వారి సంఖ్య 18కి చేరుకుంది. పేలుడు ధాటికి గోడ, మొదటి అంతస్తు శ్లాబ్ కూలడంతో శిథిలాల కింద పెద్ద సంఖ్యలో కార్మికులు ఉండిపోయినట్లు పోలీసు అధికారులు భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.