Nara Lokesh Yuvagalam Padayatra: చంద్రబాబు ఉండవల్లి నివాసం నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభం
తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర 188వ రోజుకు చేరుకుంది. నేటి నుంచి వారం రోజుల పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో యువగళం పాదయాత్ర జరగనుంది. ప్రకాశం బ్యారేజీ వద్ద పాదయాత్రకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఉండవల్లిలో చంద్రబాబు నివాసం నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఉండవల్లి సీతానగరం వద్ద పాదయాత్ర 2,500 కిలో మీటర్లు పూర్తైన సందర్భంగా శిలా ఫలకం ఆవిష్కరించనున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/unda-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet1-1-jpg.webp)